News March 21, 2025

మంచిర్యాల: పరీక్షల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు సస్పెండ్

image

మంచిర్యాల జిల్లా విద్యాశాఖలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలు తరలింపులో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సర్దార్ అలీ ఖాన్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పద్మజను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News March 22, 2025

సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపాథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 28 నుంచి జరిగే జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. జాతర నిర్వహణలో ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

News March 22, 2025

శుభ ముహూర్తం (22-03-2025)

image

☛ తిథి: బహుళ అష్టమి రా.12.34 వరకు తదుపరి నవమి ☛ నక్షత్రం: మూల రా.11.38 వరకు తదుపరి పూర్వాషాడ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: ఉ.9.నుంచి 10.30 వరకు ☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు ☛ వర్జ్యం: ఉ.6.25 నుంచి 8.07 వరకు రా.9.55 నుంచి 11.37 వరకు ☛ అమృత ఘడియలు: సా.4.45 నుంచి 6.27వరకు

News March 22, 2025

జీవీఎంసీలో 101 అంశాలకు ఆమోదం 

image

జివిఎంసి స్థాయి సంఘం సమావేశం శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో 104 అంశాలు పొందుపరిచారు. వాటిలో ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరష్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం పొందాయి. సమావేశంలో కార్యదర్శి బి.వి.రమణ, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి ,శివప్రసాద్, మల్లయ్య నాయుడు, బి.రాము ఉన్నారు.

error: Content is protected !!