News March 28, 2025

మంచిర్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

image

నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.

Similar News

News March 31, 2025

రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా?.. క్లారిటీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆప్షనల్ <<15946388>>హాలిడే<<>> ఇవ్వడంతో రేపు జరగాల్సిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై క్లారిటీ కోసం Way2News విద్యాశాఖ అధికారులను సంప్రదించింది. ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని, రేపు యథావిధిగా ఎగ్జామ్ ఉంటుందని వారు స్పష్టం చేశారు.

News March 31, 2025

యాలాల్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం..  

image

 యాలాల్ మండలం యోన్కెపల్లిలో  8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. గమనించిన స్థానికులు దుండగుడిని నిలదీశారు. అనంతంరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దుండగుడు కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News March 31, 2025

ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు 

image

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్‌ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!