News January 24, 2026
మంచిర్యాల: ‘పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 747 పాఠశాలల్లో చదువుతున్న 37,749 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోజు విడిచి రోజు కోడి గుడ్డు అందిస్తున్నామన్నారు. 100 శాతం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News March 29, 2026
పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్

TG: పొంగులేటిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని, ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్ను కలుస్తామని KTR స్పష్టం చేశారు. అసెంబ్లీలో <<19499785>>రాఘవ<<>> కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై BRS ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
News March 29, 2026
రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతా: బీదా మస్తాన్ రావు

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించినా తన స్థానానికి రాజీనామా చేస్తానని బీదా మస్తాన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
News March 29, 2026
MDK: మీ బైక్, కార్కు DANGER

2023కు ముందు తయారైన బైక్, కార్లు ఇక నుంచి డేంజర్లో పడ్డట్టే. APRIL-1 నుంచి ఉమ్మడి MDKలో అన్ని బంకుల్లో E-20 పెట్రోల్ మాత్రమే విక్రయించనున్నారు. దీన్ని తట్టుకునేలా పైపులు మార్చాలి. దీనికి దుమ్ము, తేమను ఆకర్షించే గుణం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ మారుస్తుండాలి. ట్యాంక్లో సగానికిపైగా పెట్రోల్ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.# SHAREIT


