News November 19, 2025
మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News April 5, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.148 నుంచి రూ.154, మాంసం రూ.215 నుంచి 246 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.244 నుంచి రూ.271 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 5, 2026
తూ.గో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
News April 5, 2026
ఖమ్మం డీసీసీబీకి రాష్ట్రంలో రెండో స్థానం

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4338 కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు సీఈవో NV ఆదిత్య శనివారం తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.878 కోట్ల వ్యాపారం పెరిగిందన్నారు. 2024-25లో రూ.5.30 కోట్ల లాభాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ.30 కోట్ల లాభాలు సాధించింది. సంఘం వాటాదారులకు రూ.6 కోట్ల డివిడెండ్ అందించినట్లు వెల్లడించారు.


