News April 5, 2025

మంచిర్యాల: ‘మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి’

image

జిల్లాలో అవసరమున్న చోట మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా BJP నాయకులు రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను కోరారు. శనివారం ఆయన్ను CP కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్ గౌడ్, అశోక్, తదితరులు ఉన్నారు.

Similar News

News December 17, 2025

సిద్దిపేట జిల్లాలో మూడో విడతలో 88.45% పోలింగ్

image

సిద్దిపేట జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.45% పోలింగ్ శాతం నమోదైందని అధికారులు తెలిపారు. అక్కన్నపేట-88.06%, చేర్యాల-86.97%, ధూల్మిట్ట-89.70%, హుస్నాబాద్-89.46%, కోహెడ-88.38%, కొమురవెల్లి-87.49%, కొండపాక-89.05%, కుకునూరుపల్లి-91.08%, మద్దూరు-88.24% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

BIG BREAKING: MLAల అనర్హత పిటిషన్ల కొట్టివేత

image

TG: ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు సాంకేతికంగా BRSలోనే ఉన్నట్లు వెల్లడించారు. కాగా రేపు పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.

News December 17, 2025

21న పల్స్ పోలియో కార్యక్రమం: డీఆర్‌ఓ

image

21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్‌ఓ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దీనిపై ఆయన సమీక్ష నిర్వహించారు. సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు ఉన్న 1.94 లక్షల మంది చిన్నారుల కోసం 1332 పోలియో బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి బిడ్డకు చుక్కలు వేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.