News November 28, 2024
మంచిర్యాల: ‘మీకు దండం పెడతాను.. నన్నేమీ చేయకండి’

మహదేవ్పూర్ మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు చెన్నూర్కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని <<14728225>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ వరి కోత పనుల నిమిత్తం చండ్రుపల్లికి 3 రోజుల కిందట వచ్చాడు. బుధవారం సాయంత్రం హార్వెస్టర్ డ్రైవర్ ప్రదీప్ను తన కారులో దింపేందుకు శ్రీకాంత్ కూర్చోగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బయటకు లాగారు. ‘మీకు దండం పెడతాను.. నన్నేమీ చేయకండి’ అని బతిమాలినా హత్య చేసి పరారయ్యారు.
Similar News
News November 9, 2025
పెరుగనున్న చలి తీవ్రత.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్ర చలి పరిస్థితులు నెలకొనున్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ADB కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. తెలంగాణ వేదర్మన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం జిల్లాలో 9–12 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు
News November 9, 2025
ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.
News November 9, 2025
మొక్కజొన్న, సోయాబీన్కు మద్దతు ధరతో కొనుగోలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, సందేహాల కోసం రైతులు 6300001597ను సంప్రదించాలన్నారు.


