News March 20, 2025

మంచిర్యాల: యువతికి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు 

image

మంచిర్యాలలోని రాంనగర్‌కు చెందిన బొడ్డు సంకీర్తన ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం.. ఆ తర్వాత గ్రూప్ 4, గత జనవరిలో జరిగిన సీడీపీఓ పరీక్షతో పాటు సూపర్‌వైజర్ గ్రేడ్-1లో రెండు ఉద్యోగాలు, బుధవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్ 1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2, మల్టీజోన్‌లో 1వ ర్యాంకు సాధించింది.

Similar News

News March 20, 2025

SKLM: హాస్టళ్లలో నాణ్యత పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

image

శ్రీకాకుళం జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి తొమ్మిది మందితో జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి కలెక్టరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.

News March 20, 2025

రేపు 49 మండలాల్లో వడగాలులు

image

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం-12, విజయనగరం-16, మన్యం-13, అల్లూరి-1, కాకినాడ-2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

News March 20, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు (M) పవర్ పేట రైలు ప్రమాదంలో ఒకరు మృతి *భీమడోలులో రైలు నుంచి జారి ఒకరు మృతి *చాట్రాయి (M) చిన్నంపేటలో ఉపాధి కూలీల ఆందోళన *జీలుగుమిల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.. బోర్డర్ వద్ద బంధువుల ఆందోళన*జీలుగుమిల్లిలో వ్యాన్ బోల్తా*ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభం*జంగారెడ్డిగూడెం (M) పంగిడి గూడెంలో అగ్నిప్రమాదం *చింతలపూడిలో మహిళ మృతి*టీ.నరసాపురం (M) జగ్గవరంలో గ్రావెల్ ట్రాక్టర్ బోల్తా

error: Content is protected !!