News November 10, 2025

మంచిర్యాల: రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

2026-26 సం.నికి ధాన్యం కొనుగోలు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 నంబర్లకు సంప్రదించాలన్నారు.

Similar News

News November 10, 2025

బిక్కనూర్: గురుకుల కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

image

బిక్కనూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివి, 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిషన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

News November 10, 2025

INTERESTING: అరటిపండు తినలేనోడు.. విమానాన్ని తినేశాడు

image

ప్లేట్లు, పలు వస్తువులు తినే వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి మిచెల్ లోటిటో. ఫ్రాన్స్‌లో 1950లో పుట్టారు. 9 ఏళ్ల వయసు నుంచే గాజు, ఇనుప పదార్థాలను తినడం మొదలుపెట్టారు. పికా అనే ప్రత్యేక వ్యవస్థతో లోటిటో బాడీ నిర్మితమైందని వైద్యులు తెలిపారు. ఆయన ఓ విమానాన్ని రెండేళ్లలో పూర్తిగా తినేశారు. సైకిల్స్, టీవీలు తినే లోటిటో 2006లో మరణించారు. అయితే ఆయన అరటిపండు తినలేకపోయేవారు.

News November 10, 2025

కామారెడ్డి: బీసీ ప్రజలని ఏకం చేస్తాం: విశారదన్ మహారాజ్

image

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు BCలని చిన్న చూపు చూస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని R&B గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన BC సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న BC ప్రజలను ఏకతాటి పైకి తేవడానికి అన్ని జిల్లాలో సదస్సులు నిర్వహిస్తామన్నారు.