News March 6, 2025
మంచిర్యాల: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేయబడిన బల్లార్షా-కాజీపేట-బల్లార్షా మధ్యలో నడుస్తున్న రైలు నంబర్ 17035,17036 ప్యాసింజర్ తిరిగి ఈ నెల 6 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి రాజనర్సు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్యాసింజర్ రైలు పునః ప్రారంభంతో పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
News March 6, 2025
నేటి నుంచి 10 విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు

పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6న తెలుగు, 7న హిందీ, 10న ఇంగ్లీష్, 11న గణితం, 12న భౌతిక, రసాయన శాస్త్రం, 13న జీవ శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ప్రశ్నాపత్రాలను ఎమ్మార్సీ కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.