News January 2, 2026

మంచిర్యాల: ‘వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలి’

image

మంచిర్యాల కార్పొరేషన్ పరిధి 38వ డివిజన్ సున్నం బట్టి వాడాలో 40,100,20 ఫీట్ల రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి సుమన్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రజల వద్ద సంతకాల సేకరణ చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సరైన రహదారులు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

Similar News

News January 3, 2026

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్?

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

News January 3, 2026

ప్రముఖ నటుడికి యాక్సిడెంట్

image

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్‌కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన SM ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్‌ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.

News January 3, 2026

మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

image

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.