News November 13, 2025

మంచిర్యాల: శ్రీరాంపూర్, మందమర్రికు పురస్కారం

image

బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్,మందమర్రి ఏరియాలు అత్యంత ప్రతిభ కనబరిచింది. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవాల్లో శ్రీరాంపూర్ ఏరియా75:17%తో 2వ స్థానం,మందమర్రి ఏరియా 71:33శాతంతో 3వ స్థానంలో నిలిచింది.ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఏరియా నుంచి పురస్కారం అందుకోనున్నట్లు అధికారులు చెప్పారు.2వ,3వ స్థానంలో నిలవడంతో అధికారులు,కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 13, 2025

నేవీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధం: సీఎం

image

విశాఖను దేశంలోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ సమ్మిట్ సందర్భంగా ఈస్ట్రన్ నావల్ కమాండింగ్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎంతో భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేవీ కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

News November 13, 2025

భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

image

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.

News November 13, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పూడూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4℃గా నమోదైంది. తిరుమలాపూర్లో 10.5, మల్లాపూర్, మన్నెగూడెం 10.6, గోవిందారం 10.8, మద్దుట్ల 10.9, రాఘవపేట, కత్లాపూర్ 11.0, గొల్లపల్లి 11.1, నేరెళ్ల 11.2, మల్యాల 11.3, పెగడపల్లి 11.4, సారంగాపూర్ 11.5, జగ్గసాగర్ 11.7, పొలాస 11.9, కోరుట్ల, ఐలాపూర్ 12, గోదూరులో 12.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.