News February 3, 2025

మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News September 19, 2025

NGKL: సీఎంకు ఆహ్వానం అందజేత

image

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు ఆహ్వానించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వారు గురువారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూలూరి రమేష్ బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

VKB: ‘సర్వే రిపోర్ట్ నివేదిక సరైన విధంగా అందించాలి’

image

జిల్లా సర్వే నివేదిక రిపోర్టు సంబంధిత శాఖలు సమన్వయంతో రిపోర్ట్ తయారు చేసి అందజేయాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదన కలెక్టర్ మాట్లాడుతూ.. రిపోర్టు ఆధారంగానే జిల్లాలో పరిశ్రమలకు, ఇసుక, పర్యావరణ అనుమతులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News September 19, 2025

NGKL: సోషల్ మీడియా ప్రకటనలు నమ్మోద్దు: ఎస్పీ

image

సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్లు, దసరా బహుమతుల ప్రకటనలను నమ్మోద్దని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రజలకు సూచించారు. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామని వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. స్పిన్ వీల్, స్క్రాచ్ కార్డుల లాంటి లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని ఆయన తెలిపారు.