News February 3, 2025

మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News December 26, 2025

పీరియడ్స్‌లో వీటికి దూరంగా ఉండండి

image

పీరియడ్స్ సమయంలో వాకింగ్, యోగా వంటి తక్కువ ప్రభావమున్న వ్యాయామాలు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అధిక బరువులు ఎత్తడం, రన్నింగ్, దూకడం, వంటి శరీరంపై అధిక ప్రభావం చూపించే వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో, ఓవర్‌హెడ్ , క్రంచెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు. వీటివల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేఅవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

News December 26, 2025

మిరపలో పూత పురుగును ఎలా నివారించాలి?

image

మిరప పూత మొగ్గలపై ఈ మొగ్గలు గుడ్లు పెడతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన చిన్న లార్వాలు పూలలోని అండాశయాన్ని తొలిచి తింటాయి. దీని వల్ల అండాశయం తెల్లగా మారి ఉబ్బుతుంది. మొగ్గలు విచ్చుకోకుండ రాలిపోతాయి. పిందే దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా త్వరగా పండుబారి విపరీతంగా రాలిపోతాయి. పూత పురుగును నివారించడానికి లీటరు నీటికి Tolfenpyrad అనే మందు 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.