News February 19, 2025

మంచిర్యాల: 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

image

మంచిర్యాల జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,189 మంది రెగ్యులర్, 221 మంది విద్యార్థులు సప్లీలు రాయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

Similar News

News November 9, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

image

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.

News November 9, 2025

10న ఏలూరుకు కేంద్ర బృందం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర బృందం ఈ నెల 10న ఏలూరు జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు బృందం ఉంగుటూరు చేరుకుంటుంది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి, పునరుద్ధరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సమీక్షిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 9, 2025

NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

image

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.