News March 16, 2025
మండపేట: మాజీ మున్సిపల్ ఛైర్మన్ తల్లి మృతి

మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాతృమూర్తి చుండ్రు అనంతలక్ష్మి (70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజులు క్రితం గుండె సంబంధిత సమస్యలు తలెత్తగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
‘కాక్టైల్ 2’ క్రేజీ అప్డేట్.. రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రొమాన్స్?

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాక్టైల్ 2’లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని టాక్. కొత్త రకం పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ల బోల్డ్ ప్రయోగంపై నెట్టింట చర్చ నడుస్తోంది. septలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని Maddock Films నిర్మిస్తోంది.
News February 20, 2026
బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.


