News March 9, 2026
మండే ఎండలు.. ఉరుములతో వర్షాలు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది.
Similar News
News April 5, 2026
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

*వివేక్ ఎక్స్ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్సాగర్ ఎక్స్ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.
News April 5, 2026
హిమంత క్షమాపణ కోరినా వదిలేది లేదు: రాహుల్

దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన CM హిమంత అని INC అగ్రనేత రాహుల్ విమర్శించారు. ఆయన క్షమాపణ కోరినా వదలబోమని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ మరణానికి బాధ్యులైన వారితో CMకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి హిమంత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.


