News August 31, 2025
మంత్రాలయం: పట్టు వదలని విక్రమార్కుడు.!

మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన నరసింహులు పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేసి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో ఉద్యోగం సంపాదించాడు. నరసింహులు ఒకవైపు ప్రైవేటుగా చేస్తూ మరో వైపు 11 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉద్యోగం సంపాదించాడు. 2014, 2018 డీఎస్సీ పరీక్ష రాయగా స్వల్ప మార్కుల తేడాతో మిస్సయ్యాడు. అయినా కూడా పట్టు వదలకుండా సాధన చేసి 48వ ర్యాంకుతో పీఈటీగా ఎంపికయ్యాడు.
Similar News
News August 31, 2025
నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎస్పీ

ఆదోని మండలం హరివాణంలో ఆదివారం ఎల్లెల్సీ కెనాల్ వద్ద జరుగుతున్న గణేశ్ష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. వినాయక నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News August 31, 2025
రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది: కలెక్టర్

మార్క్ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.
News August 31, 2025
ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.