News February 7, 2026

మంత్రాలు చదవాలా, ఉచ్ఛరించాలా?

image

బుద్ధిని పెంచుకోవడానికి ‘గ్రంథాలు’ చదవాలి. ఏకాగ్రత, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపడానికి స్తోత్రాలు ‘పఠించాలి’. అనుకున్న ఫలితం సిద్ధించాలంటే అక్షర దోషం లేకుండా మంత్రాన్ని ‘ఉచ్ఛరించాలి’. దేవునితో అనుబంధాన్ని, శరణాగతిని పొందాలంటే ఆయన గుణాలను ‘స్తుతించాలి’. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రేమతోనే ఆయన నామాన్ని ‘పలకాలి’. తద్వారా దైవ సాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చు. ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన భక్తి సాధ్యం.

Similar News

News February 18, 2026

మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

image

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

News February 18, 2026

ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

image

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

News February 18, 2026

ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

image

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.