News February 12, 2026
మంత్రికి విన్నవించుకున్న MP అవినాశ్ రెడ్డి

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News February 14, 2026
కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్లైన్లో POLO, WALLA యాప్లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News February 14, 2026
గండికోటకు వెళ్తున్న ప్రేమ జంటకు ప్రమాదం.. యువతి మృతి.!

కడప నగర శివారులోని ఆలంఖాన్పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.


