News June 17, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి

image

రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా నియమితులైన సాలూరు, MLA గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదట అంతస్థులో వేద పండితులు పూజలు నిర్వహించగా రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ బాధ్యతలు స్వీకారాన్ని స్వయంగా చూడటానికి సాలూరు నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

Similar News

News October 3, 2024

సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్

image

కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2024

VZM: టెట్ ఎగ్జామ్‌కి వెళ్లే వారు ఇవి పాటించండి

image

ఈ రోజు నుంచి జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రావడం నిషేధం.

News October 3, 2024

విజయనగరం: టెట్ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఇవే..

image

నేటి నుంచి ప్రారంభం కానున్న టెట్ పరీక్షలకు జిల్లాలో 22,979 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్షల కోసం జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
⁍ స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల (కలవరాయి, బొబ్బిలి మండలం)
⁍ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల
⁍ సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(గాజులరేగ)
⁍ అయాన్ డిజిటల్ జోన్ (గాజులరేగ)
⁍ జొన్నాడ లెండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 21 వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి.