News March 15, 2025

మంత్రి ఉత్తమ్‌తో తుమ్మల భేటీ..!

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై సమావేశమయ్యారు. తుమ్మల మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేయాలని భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, 4వ పంపు హౌస్ నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, సమయపాలనపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.

Similar News

News December 24, 2025

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు..!

image

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని, అనుభవం లేని అర్హత లేని వ్యక్తులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకొనే వారికి యాంటీబయోటిక్ మందులను విక్రయిస్తున్నారంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News December 24, 2025

JEE, NEET ఎగ్జామ్స్‌లో ఫేషియల్ రికగ్నిషన్!

image

JEE, NEET పరీక్షల్లో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయాలని NTA భావిస్తోంది. 2026 నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు దీనికి శ్రీకారం చుడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పరీక్షలకు అప్లై చేసుకునే టైంలో రీసెంట్ ఫొటో‌గ్రాఫ్‌ల స్కాన్‌తో పాటు లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.

News December 24, 2025

‘ఓటర్ జాబితా సవరణ, మ్యాపింగ్ పూర్తి చేయాలి’

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, డేటా మ్యాపింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీవో రాహుల్, మండల తహాశీల్దార్లతో ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ పై సమీక్ష జరిపారు.