News July 2, 2024
మంత్రి కోమటిరెడ్డికి కంచర్ల కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719919821388-normal-WIFI.webp)
<<13545889>>మంత్రి కోమటిరెడ్డికి <<>>మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రూ.100 కోట్లు పలికే భూమి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిగతా పార్టీ ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్కి భూ కేటాయింపు జరిగిందన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు.
Similar News
News July 5, 2024
నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159387467-normal-WIFI.webp)
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 5, 2024
నల్గొండ: ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150722698-normal-WIFI.webp)
కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
News July 5, 2024
నల్గొండ: ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150722698-normal-WIFI.webp)
కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.