News September 20, 2024

మంత్రి దుర్గేష్ రేపటి పర్యటన ఇలా..

image

మంత్రి కందుల దుర్గేష్ శనివారం కాకినాడలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు కాకినాడ టూరిజం డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడలో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్స్‌పెక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Similar News

News October 13, 2024

అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

News October 12, 2024

కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!

image

లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.

News October 12, 2024

రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.