News February 16, 2026

మంత్రి లోకేశ్‌తో కలసి క్రికెట్ చూసిన ఎంపీ సానా

image

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరుకు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రాజ్యసభ సభ్యుడు, ACA కార్యదర్శి సానా సతీశ్ బాబు ప్రత్యక్షంగా వీక్షించారు. గ్యాలరీలో భారత జెండా ఊపుతూ జట్టు విజయాన్ని వీరు మనస్ఫూరంగా ఆస్వాదించారు.

Similar News

News February 17, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 72 పిటిషన్ల స్వీకరణ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్ 72 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కార్యాలయానికి విచ్చేసిన ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి పిటిషన్ స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.

News February 17, 2026

ఆలేరు: అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో తన తల్లి అంత్యక్రియలు హాజరయ్యేందుకు ఆలేరు నుంచి క్వాలిస్ వాహనంలో తూర్పు గూడెం వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మల్లిక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

News February 17, 2026

మిర్యాలగూడ: గిరిజన సంప్రదాయంగా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం

image

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఏఐఎస్బీ 1, ఇండిపెండెంట్ ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం అట్టహాసంగా కొనసాగింది. 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిరావత్ స్వర్ణ కౌన్సిలర్‌గా నేడు జరిగిన ప్రమాణస్వీకారంలో గిరిజన సంప్రదాయ వేషధారణలో వచ్చి ప్రమాణం స్వీకారం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.