News January 29, 2025
మంత్రి లోకేశ్ను కలిసిన ఎమ్మెల్యే బుడ్డా

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేశ్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 21, 2026
GVMC పరిధిలో సర్వేయర్ల దోపిడీ ఆరోపణలు!

GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ భూముల వివరాలు,సర్వే సర్టిఫికెట్లు,విఎల్టీ,ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.పనిని బట్టి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
News February 21, 2026
బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.
News February 21, 2026
అమరావతి రివర్ఫ్రంట్ అభివృద్ధికి టెండర్లు

అమరావతి-కృష్ణా రివర్ఫ్రంట్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం ఏజీఐసీఎల్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కన్సల్టెంట్ల నియామకానికి మార్చి 13 వరకు బిడ్లు దాఖలు చేసే అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా కమర్షియల్, ఫైనాన్షియల్, టూరిజం జోన్లను అభివృద్ధి చేస్తారు. వరదలను తట్టుకునేలా 6-8 లైన్ల రోడ్లు, అత్యాధునిక మౌలిక వసతులు నిర్మించనున్నారు.


