News March 7, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందా మరొకరికి గాయాలయ్యాయి. మృతిని పేరు ఉదయ్గా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని అంబులెన్స్లో మంథని హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) నుంచి రెండు బైక్లపై నలుగురు యువకులు ఖమ్మంపల్లిలో స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Similar News
News March 7, 2025
KNR జిల్లాలో పగలు వేడి.. రాత్రి చలి

KNR జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నప్పటికీ, రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాలో పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 36.1℃ గరిష్ట నమోదు కాగా, శంకరపట్నం మండలం కొత్తగట్టు 13.6°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. ఈ పరిస్థితిపై మీ కామెంట్..?
News March 7, 2025
కరీంనగర్: పెళ్లి ఊరేగింపులో విషాదం.. మహిళ మృతి..UPDATE

కరీంనగర్ జిల్లాలో ఓ పెళ్లి ఊరేగింపులో కారు బీభత్సం సృష్టించగా పలువురు గాయపడ్డారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లిలో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో బాకారపు ఉమ అనే మహిళ తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ కారు బీభత్సంతో గ్రామంలో దాదాపు 20 కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 7, 2025
కోనరావుపేటలో గుండెపోటుతో కార్మికుడి మృతి

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెర కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండగుల కనకయ్య(50) అనే కార్మికుడు బావుసాయి పేట గ్రామ శివారులో బండలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.