News August 29, 2025

మంథని: ‘లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

గోదావరినదిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మంథని పట్టణంలోని గోదావరితీరాన్ని ఆయన పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News August 29, 2025

అందుకే టాలీవుడ్‌కు దూరమయ్యా: కమలినీ ముఖర్జీ

image

ఆనంద్, గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కమలిని ముఖర్జీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించిన స్థాయిలో తెరకెక్కకపోవడమే ఈ దూరానికి కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగి తెలుగు చిత్రాల్లో నటించట్లేదని చెప్పారు. అయితే ఆ మూవీ పేరును వెల్లడించలేదు. చివరగా ఈ బ్యూటీ తెలుగులో ‘గోవిందుడు అందరివాడే’లో నటించారు.

News August 29, 2025

NZB: క్రీడా పోటీలు రద్దు

image

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

News August 29, 2025

ADB: వినాయకుడిని దర్శించుకున్న గోమాత

image

భీంపూర్ మండలం అంతర్గాంలో త్రినేత్ర గణేష్ మండలి వద్ద హారతి తర్వాత ఓ విచిత్ర ఘటన జరిగింది. అటుగా వచ్చిన ఓ ఆవు, దాని దూడ వినాయకుడి విగ్రహం ముందు నిలబడి భక్తితో చూస్తున్నట్లు కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువకులు వాటికి నైవేద్యం సమర్పించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్వతి పుత్రుడు గణపతిని మురిపెంగా చూస్తూ ఆవు దూడలు అలా దర్శనం చేసుకుంటున్నట్లు కనిపించాయి.