News August 13, 2024
మందమర్రి: ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ బాలికల జట్టు ఎంపిక పోటీలు

మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలికల ఫుట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రీడాకారులు హాజరు కాగా జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈనెల 16, 17, 18 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్ షిప్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ రఘునాథరెడ్డి తెలిపారు.
Similar News
News February 9, 2026
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ADB కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని జిల్లాలో వంద పోలింగ్ శాతం నమోదుకు భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
News February 9, 2026
గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్కు పంపవచ్చని సూచించారు.
News February 9, 2026
ADB: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.


