News October 13, 2025
మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.
Similar News
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.