News March 11, 2025
మందమర్రి: మహిళపై గొడ్డలితో దాడి

మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అంగడిబజార్ ప్రాంతంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కందుల కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంచినీళ్ల విషయంలో పగిడి రాంబాయి అనే మహిళతో గొడవపడ్డాడు. అనంతరం ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో దాడి చేయగా రాంబాయి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
2027 గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ఏర్పాట్లు ప్రారంభం

2027లో మొదలయ్యే గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మాస్టర్ ప్లాన్, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు, రోడ్లు, పార్కింగ్, నీరు, వైద్య సేవలపై సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
News September 18, 2025
మంచిర్యాల: 19న పలు రైళ్ల రద్దు

మందమర్రి-రామగుండం మధ్య 24 కి.మీ ట్రిపుల్ లైన్ రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టడంతో ఈనెల 19న పలు రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రామగిరి ఎక్స్ప్రెస్, కాజీపేట-బల్లార్షా ఎక్స్ప్రెస్ పూర్తిగా రద్దు కాగా, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్-కాజీపేట వరకు, సింగరేణి ఎక్స్ప్రెస్ భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ వరకు నడుస్తాయని తెలిపారు.