News August 28, 2025
మందమర్రి: సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన మహిళ

సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన ఓ మహిళ రూ.6.37 లక్షలను పోగొట్టుకున్నట్లు SI రాజశేఖర్ చెప్పారు. SI తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన మహిళ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో THAW and REPAIR ప్రకటన చూసి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి, సంబంధిత టెలిగ్రామ్ యాప్లో చేరింది. మొదటగా బాధితురాలి ఖాతాలో రూ.5 వేలు జమైనట్లు చూపించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా రూ.6.37 లక్షలు పెట్టి, పోగొట్టుకుంది.
Similar News
News August 29, 2025
క్రీడా ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కావాలి: రేవంత్

తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉన్నట్లుగానే క్రీడా సంస్కృతి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని స్పోర్ట్స్ హబ్ బోర్డ్ <<17546114>>సమావేశంలో<<>> అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము క్రీడా రంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 29, 2025
వరంగల్: ఇంటర్ పూర్తి చేసిన వారికి శుభవార్త

HCL టెక్నాలజీస్ ఆధ్వర్యంలో HCL TECH Bee జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-2025లో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు MPC, MEC, CEC, BIPC, Vocational Computers పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన హనుమకొండలోని ICSS కంప్యూటర్ ఎడ్యుకేషన్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News August 29, 2025
సోషల్ మీడియా కుట్రలను తిప్పికొట్టాలి: పవన్ కళ్యాణ్

AP: దేశ చరిత్రలోనే జనసేన విజయం ఓ మైలురాయి అని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనమని చెప్పారు. సోషల్ మీడియాలో కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 15 ఏళ్లు ఏ పదవీ లేకుండా ఉన్నానని, జనసేన అంటేనే పోరాటాలకు స్ఫూర్తి అని చెప్పారు. కూటమి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.