News March 15, 2025

మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

image

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.

Similar News

News February 21, 2026

కుందేళ్ల షెడ్డు నిర్మిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి

image

కుందేళ్ల షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టాలి. షెడ్‌ పరిసరాల్లో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దాల వల్ల కుందేళ్లు భయపడి వాటి ఉత్పాదక సామర్థ్యం తగ్గే ఛాన్సుంది. షెడ్డు లోపల చల్లని వాతావరణం ఉండాలి. షెడ్డు ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా.. చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News February 21, 2026

గురువారం ‘తిరుప్పావడ సేవ’

image

గురువారం స్వామివారికి అన్ని ఆభరణాలు తొలగించి ధోవతి, ఉత్తరీయాలే ఉంచుతారు. ఈరోజు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నామ పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఆ దివ్య నేత్రాలను నేరుగా చూడవచ్చు. దీన్నే నేత్ర దర్శనం అంటారు. బంగారు తొట్టిలో భారీగా పులిహోర నివేదిస్తారు. నామం తీసినప్పుడు స్వామివారి శక్తిమంతమైన చూపు నేరుగా భక్తులపై పడకుండా దీనిపై పడేలా చేస్తారు. అందుకే దీనికి పావడ అని పేరొచ్చింది.

News February 21, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాయనున్నారంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు మధ్య పరీక్షలు జరగనున్నాయి.