News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.
Similar News
News November 3, 2025
వనపర్తి: వర్షపాతం వివరాలు ఇలా..!

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో (ఆదివారం ఉదయం 8:30AM నుంచి సోమవారం ఉదయం 8:30AM) వరకు నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా అమరచింతలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కానాయిపల్లి 1.3 మిల్లీమీటర్లు, విలియంకొండ 0.5 మిల్లీమీటర్లు, మిగతా 19 వర్షపాతం నమోదు కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News November 3, 2025
ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.
News November 3, 2025
కరీంనగర్లో ‘మున్నూరుకాపు’ డామినేషన్

KNR రాజకీయాలలో మున్నూరుకాపు సామాజికవర్గం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రిగా బండి సంజయ్ కుమార్, MLAగా గంగుల కమలాకర్ కొనసాగుతుండగా, తాజాగా జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లోనూ ఛైర్మన్గా అదే వర్గానికి చెందిన కర్ర రాజశేఖర్ గెలుపొందారు. 12 మంది డైరెక్టర్లలో ఏడుగురు కాపులే గెలవడం గమనార్హం. నిన్నటి వరకు KNR కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా చల్లా స్వరూప హరి శంకర్ కొనసాగారు.


