News September 13, 2025
మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.
Similar News
News September 13, 2025
విజయనగరం ఎస్పీ బదిలీ

విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏ.ఆర్.దామోదర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దామోదర్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వకుల్ జిందాల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు.
News September 13, 2025
నేడు విజయనగరం కలెక్టర్గా బాధ్యతల స్వీకరణ

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్గా, సీడీఏ కమిషనర్గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్కర్కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
News September 13, 2025
VZM: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికలు

రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికను ఆరికతోట జడ్పీ హైస్కూల్లో చేపట్టారు. ఇందులో 50 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా జూడో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నకిశోర్ తెలిపారు. అండర్14, 17, 19 జిల్లా జూడో టీం ఎంపిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 25 మంది బాలికలు, 25 మంది బాలురు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వెళ్లనున్నట్లు చెప్పారు.