News January 14, 2026
మకరజ్యోతి వేళ.. శబరిమలలో మరో స్కామ్!

కేరళ శబరిమల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో మరో స్కామ్ బయటపడింది. అయ్యప్ప అభిషేకం కోసం భక్తులు ఆలయం వద్ద కొనే నెయ్యి ప్యాకెట్ల డబ్బు రూ.35 లక్షలు బోర్డుకు చేరలేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం కేసును ACBకి అప్పగించింది. ఇప్పటికే 5Kgs బంగారు తాపడాల మిస్సింగ్ స్కామ్ రాజకీయంగానూ దుమారం రేపుతుండగా ఈ ఉదంతంతో ప్రభుత్వం మరింత కార్నర్ కానుంది. అటు ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది.
Similar News
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.
News February 21, 2026
NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.


