News March 30, 2024
మక్కువలో నవవధువు మృతి

మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నవవధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.
Similar News
News February 16, 2026
విజయనగరం కలెక్టరేట్కు 259 వినతులు

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్కు, 93 రెవెన్యూ క్లినిక్కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 16, 2026
VZM: ‘జిల్లా ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి’

విజయనగరం జిల్లాలోని సాగు, త్రాగునీటి ప్రాజెక్టులను, కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్లో అధికారులకు వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఆదినారాయణ, రామారావు మాట్లాడుతూ..జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, సాగునీరు ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
News February 16, 2026
లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్కు సెలవు ఇచ్చారా..


