News January 23, 2025
మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.
Similar News
News January 9, 2026
వికారాబాద్: టెట్ పరీక్షకు తండ్రి-కొడుకులు

ఉపాధ్యాయులకు టెట్ సంకటంగా మారింది. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన గోబ్ర్యా నాయక్ కొండాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. తన కొడుకు దినేశ్ గతంలో డీఎస్సీ రాశారు. తాజాగా తండ్రి కొడుకులు పరీక్షకు హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
News January 9, 2026
బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి: మమత

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.
News January 9, 2026
అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఆదినారాయణ రెడ్డి

అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఆదినారాయణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల నుంచి బదిలీపై ఆయన వచ్చారు. జిల్లా పరిధిలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ పనితీరు, అత్యవసర సేవలు, భద్రత చర్యలపై చర్చించారు. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్గా పనిచేసిన అనిల్ కుమార్ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు.


