News January 23, 2025

మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.

Similar News

News November 6, 2025

వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

image

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

News November 6, 2025

ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

image

జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కి వివరించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి నిర్వహించిన వీసీ‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి, సూచనలు, ఫిర్యాదులను తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు.

News November 6, 2025

సింగరేణి అధికారులకు సీఎండీ సూచనలు

image

మైనింగ్ తో పాటు అన్ని శాఖల అధికారులు బాగా పనిచేయాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని, పనితీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. గురువారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షలో సూచనలు చేశారు. వివిధ కార్పోరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు ప్రత్యక్షంగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.