News December 29, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
Similar News
News December 30, 2025
EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండాలి: కలెక్టర్

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉన్న EVM నిల్వ కేంద్రాన్ని త్రైమాసిక తనిఖీ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో కలెక్టర్తో పాటు పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలన్నారు.
News December 29, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News December 28, 2025
కోడూరు పంట కాలువలో మృతదేహం కలకలం

కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే కోడూరు లేదా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు.


