News July 8, 2025

మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

image

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.

Similar News

News February 22, 2026

కృష్ణా: ఈ మాస్టారు రూటే సెపరేటు..!

image

కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నారు. చేపల సాగు, మడ అడవుల సంరక్షణ, వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సైన్స్ అంశాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

News February 22, 2026

గుడివాడ: రైలులో మర్చిపోయిన రూ.14 లక్షల సొత్తు అప్పగింత

image

విశాఖ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో వరలక్ష్మి అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయి భీమవరం టౌన్‌లో దిగిపోయారు. బాధితురాలి సమాచారంతో గుడివాడ రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు గుడివాడ రాగానే తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోని 110 గ్రాముల బంగారం, రూ. 5వేల నగదు, మొబైల్ ఫోన్‌ను (మొత్తం విలువ రూ.14 లక్షలు) పోలీసులు బాధితురాలికి అందజేశారు.

News February 22, 2026

గుడివాడ: రైలులో మర్చిపోయిన రూ.14 లక్షల సొత్తు అప్పగింత

image

విశాఖ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో వరలక్ష్మి అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయి భీమవరం టౌన్‌లో దిగిపోయారు. బాధితురాలి సమాచారంతో గుడివాడ రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు గుడివాడ రాగానే తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోని 110 గ్రాముల బంగారం, రూ. 5వేల నగదు, మొబైల్ ఫోన్‌ను (మొత్తం విలువ రూ.14 లక్షలు) పోలీసులు బాధితురాలికి అందజేశారు.