News September 20, 2025

మచిలీపట్నం: పేర్ని నానితోపాటు 400 మందిపై కేసు నమోదు

image

అనుమతి లేని ఛలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 400 మందిపై మచిలీపట్నం PSలో కేసు నమోదైంది. వీరిలో ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేశ్, దేవభక్తుని చక్రవర్తి, దేవినేని అవినాశ్ ఉన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నిరసన కార్యక్రమం నిర్వహించడంతోపాటు పోలీసులపై దురుసుగా వ్యవహరించారని, ఈ కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Similar News

News September 20, 2025

హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..!

image

హనుమకొండ కలెక్టరేట్‌లోని ఓ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని అదే సెక్షన్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే బదిలీ చేశారట.

News September 20, 2025

మర్రిపూడిలో భార్యను చంపిన భర్త మృతి

image

మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఈ నెల 13న భార్య జయమ్మను రోకలిబండతో భర్త నారాయణ (50) హత్య చేశారు. అనంతరం తానూ గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై టి.రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. వారికి 25 ఏళ్ల కిందట వివాహం కాగా అనుమానంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భార్యను చంపినట్లు సమాచారం.

News September 20, 2025

డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

image

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.