News June 6, 2024

మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికలలో 4వ స్థానంలో NOTA

image

మచిలీపట్నం లోక్‌సభకు జరిగిన తాజా ఎన్నికలలో NOTAకు మొత్తం 12,126 ఓట్లు పడ్డాయి. వీటిలో EVMలలో 12,008, పోస్టల్ బ్యాలెట్లలో 1,18 ఓట్లు పడ్డాయి. కాగా పోటీ చేసిన 15 మంది అభ్యర్థులలో విజేతగా నిలిచిన బాలశౌరి(జనసేన), చంద్రశేఖర్(వైసీపీ), గొల్లు కృష్ణ(కాంగ్రెస్) తర్వాత NOTAకు అత్యధికంగా ఓట్లు పడటంతో NOTA 4వ స్థానంలో నిలిచింది.

Similar News

News September 29, 2024

TDP MLC అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. నేడే అనౌన్స్?

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

News September 29, 2024

సీఎం చంద్రబాబుతో సిద్దార్థనాథ్ సింగ్ భేటీ

image

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.

News September 29, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.