News July 11, 2024

మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి: మేఘా స్వరూప్

image

అనంతపురం నగరంలో పర్యావరణహితం కోసం గురువారం అనంతపురం నగర మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితికి కేవలం మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు, థర్మాకోల్ వాడడానికి అనుమతి లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి నగర ప్రజలందరూ ఈ నియమాలు పాటించి సహకరించవలసిందిగా కోరారు.

Similar News

News February 16, 2026

పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పన్నుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. కోట్లాది రూపాయల పన్నులు పెండింగ్‌లో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీనెల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 16, 2026

ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

రైతులు ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పథక పోస్టర్లను ఆవిష్కరించారు. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఆటోమేషన్‌కు హెక్టారుకు రూ.40,000 సూచిక వ్యయంపై సబ్సిడీ అందుతుందని తెలిపారు. నీటి వృథా తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం లేదా ఉద్యానవన కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 16, 2026

బిల్‌ గేట్స్‌ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్

image

అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి బిల్‌ గేట్స్‌ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎన్ఐసీ భవనం నుంచి జిల్లా కలెక్టర్‌ ఆనంద్, జాయింట్ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పాలనలో సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.