News November 29, 2024

మడకశిర వద్ద బాలుడి దారుణ హత్య!

image

మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ నిన్న అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మడకశిర సరిహద్దులోని కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడు మృతిచెంది కనిపించాడు. దుండగులే ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించి వాస్తవ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Similar News

News April 25, 2025

మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

image

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.

News April 24, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు. 

News April 24, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.