News November 11, 2024

మడకశిర సమీపంలో చిరుత మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

Similar News

News December 17, 2025

బాదనహాల్ రైల్వే స్టేషన్ ప్రారంభం

image

డి.హిరేహాల్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్‌ను రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం -సోమలాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఈ రూటులో పలు రైళ్లు రద్దు చేసి బాదనహాల్ స్టేషన్‌లో లైన్ మార్పిడి చేశారు. అనంతరం రైలును ఈ ట్రాక్‌పై నడిపి ట్రయల్ రన్ చేశారు. నూతన బిల్డింగ్‌ను ప్రారంభించారు. పలువురు హుబ్లి డివిజన్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

News December 17, 2025

అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.

News December 17, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

image

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.