News July 10, 2024

మత్స్యశాఖ అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష

image

మత్స్యశాఖ అధికారులతో బుధవారం టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. విజయవాడలోని మత్స్యశాఖ కమీషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. మత్స్యకారుల జీవన విధానం, సమస్యలు, వేటనిషేధ భృతి, సంక్షేమ పథకాలు, మెరుగైన జీవనోపాధి, భద్రత తదితర ముఖ్య అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

Similar News

News October 7, 2024

శ్రీకాకుళం: 129 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అధికారులు హాజరు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి 129 అర్జీలు స్వీకరించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.

News October 7, 2024

SKLM: 51 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట పరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని, సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 51 ఫిర్యాదులు స్వీకరించమని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు.

News October 7, 2024

SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ

image

జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.