News September 11, 2025
మదనపల్లిలో లంబాడీల గడీలు..!

సంచార గిరిజన వర్గంగా గుర్తింపు పొందిన లంబాడీలకు(బంజారా) గడీలు ఉన్నాయంటే నమ్ముతారా..!? తెలంగాణలో ఒకప్పుడు దొరల పాలనకు ప్రతీకగా ఉండే గడీలను పోలిన కట్టడాలు ములుగు(M) మదనపల్లిలో ఉన్నాయి. నిజాం కాలంలో ఇక్కడి లంబాడీలు భూస్వాములుగా ఉండేవారని, అప్పుడే విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. గడీలు శిథిలం కాగా వాటి ఆర్చీలు చెక్కు చెదరలేదు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామం ఇదే.
Similar News
News September 11, 2025
“స్ఫూర్తి పథం” కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.
News September 11, 2025
చిక్కడపల్లిలో BRSV ఆందోళన

చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేశారు. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనియాస్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరశన కార్యక్రమం నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవుకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలను రివాల్యుయేషన్ చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేశారు.
News September 11, 2025
ఇలా ఉంటే మీ డిప్రెషన్ తొలగుతుంది!

ప్రస్తుతం చాలా మందిలో డిప్రెషన్, అసూయ, అభద్రతా భావం నెలకొంటోంది. అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలపాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మానసిక వైద్యుడు శ్రీకాంత్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మనకున్నది కోల్పోతే అది దిగులు. మనకులేనిది పక్కోడికి ఉంటే అది అసూయ. మనకున్నది పోతుంది అనుకుంటే ఆందోళన. అదే మనకేమీ లేదనుకుంటే ఇలాంటి సమస్యలేవీ ఉండవు’ అని ఆయన తెలిపారు. దీనిపై మీ కామెంట్?