News July 8, 2025
మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో మంగళవారం కిలో టమాటా రూ.37 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ అభిలాశ్ తెలిపారు. వారం రోజులుగా రూ. 34 నుంచి 37 వరకు పలికాయన్నారు. ఏకంగా 10 కిలోల మేలు రకం టమాటా బాక్స్ రూ.370, రెండో రకం రూ.350, మూడో రకం రూ.310 పలికినట్లు వెల్లడించారు. మొత్తం 1,055 క్వింటాళ్ల టమాటా మార్కెట్కు వచ్చిందన్నారు. రేట్లు ఇలాగనే ఉంటే రైతుల కలలు నెరవేరుతాయని చెప్పారు.
Similar News
News July 9, 2025
హనుమకొండ: వడ్ల బస్తాల లోడ్ లారీ దగ్ధం

వడ్ల బస్తాల లోడ్తో ఉన్న లారీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ దగ్గర ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వడ్ల బస్తాల లోడ్తో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
News July 9, 2025
ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
News July 9, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.