News June 14, 2024
మదనపల్లె: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తండ్రినే చంపేసింది..!

మదనపల్లెలో టీచర్ దొరస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి ఖాయం చేయడంతో దొరస్వామి కుమార్తే చపాతి కర్ర, ఇనుప అట్టతో కొట్టి చంపినట్లు తెలిపింది. హరితను పోలీసులు అదుపులోకి తీసుకుని,హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేమ విషయమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రియుడితో కలిసి ఉండడాన్ని గమనించి తండ్రి మందలించారని..ప్రియుడితో కలిసి హత్య చేసి ఉంటుందని అంటున్నారు.
Similar News
News February 21, 2026
చిత్తూరు: ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయండి!

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్లైన్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
News February 21, 2026
చిత్తూరు: పోలీసుల శ్రమదానం

స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటారు.
News February 21, 2026
చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.


