News January 20, 2026

మదనపల్లె: కర్నూలులోనూ ఏసీబీ దాడులు

image

మదనపల్లె DEO ఆఫీసుపై ACB అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. గుర్రంకొండలోని ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రినాయుడు వద్ద సోమవారం రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా కడపకు చెందిన ACB డీఎస్పీ సీతారామారావు, CIనాగరాజ దాడులు చేశారు. సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా(మున్నా), ఏడీ రాజశేఖర్‌ను అరెస్టు చేశారు. కర్నూలులోని ఏడీ రాజశేఖర్ సొంత ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Similar News

News February 17, 2026

జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

image

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.

News February 17, 2026

సిద్దిపేట: మహిళా మణులకే పదవులు!

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వాయ్యాయి. దీంతో కీలకమైన పదవిలో 4 మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా మేడిశెట్టి ఉమా, దుబ్బాక-ఆశ సులోచన, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-కళ్యాణ్ కర్ పద్మాభాయి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ పదవి చేపట్టారు. ఇక్కడ ఛైర్ పర్సన్‌లు కూడా మహిళలే.

News February 17, 2026

BREAKING: ఇంద్రేశం ఛైర్మన్ పీఠం BRS కైవసం

image

కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. రెండో రోజు 10 మంది BRS, ఇద్దరు BJP కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కోరం లభించింది. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 8వ వార్డు BRS కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్‌గా 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.