News December 29, 2025
మదనపల్లె జిల్లానే.. కానీ పేరు అన్నమయ్య!

మదనపల్లె జిల్లాలో కొత్త ట్విస్ట్ నెలకొన్నట్లు సమాచారం. రాజంపేటను కడపలో, రైల్వేకోడూరును తిరుపతిలో కలపడంతో అన్నమయ్య జిల్లా రద్దు అవుతుందని అందరూ భావించారు. రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లా(మందు అనుకున్న పేరు)లో కలుపుతారు. మదనపల్లె కేంద్రంగానే అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిన్నటి సమావేశంలో సీఎంతో చర్చించినట్లు సమాచారం. నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
Similar News
News February 8, 2026
భారత్-పాక్ మ్యాచ్.. కాసేపట్లో నిర్ణయం!

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. అయితే PCB మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్తో జరగనున్న మ్యాచ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ICC అఫీషియల్స్-PCB సభ్యులు భేటీకానున్నారు. ఈ సమావేశం ముగిశాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
News February 8, 2026
NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.
News February 8, 2026
షుగర్ కంట్రోల్కు బెస్ట్ ఫుడ్స్ ఇవే..

బ్లడ్ షుగర్ లెవెల్స్పై ప్రభావం చూపే ఫుడ్స్కు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి రేటింగ్ ఇచ్చారు. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే గుడ్లు, పచ్చని కూరగాయలు (10/10) మేటి ఆహారాలుగా నిలిచాయి. నట్స్ (9/10), బెర్రీలు (8/10) షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. అయితే వైట్ రైస్ (3/10), ఫ్రూట్ జ్యూస్ (2/10) రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని, షుగరీ డ్రింక్స్ (0/10) చాలా డేంజర్ అని హెచ్చరించారు.


