News April 22, 2024

మదనపల్లె: పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.

Similar News

News October 11, 2025

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు: కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, జడ్పీ నిధులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్, RWS శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. నవంబరులోగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీటి సమస్య లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.

News October 11, 2025

పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్‌లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.

News October 10, 2025

రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

image

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.