News December 12, 2024
మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.
News February 14, 2026
చిత్తూరు: ఈ ఏడాది నీటి ఎద్దడి లేనట్లే.!

కృష్ణా జలాలతో ఈ ఏడాది జిల్లాలో నీటి ఎద్దడి తప్పింది. పుంగనూరు తంబళ్లపల్లె, మదనపల్లె, నియోజకవర్గాలలోని అన్ని చెవులకు, పలమనేరులో కొన్ని చెరువులకు హంద్రి-నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తంబళ్లపల్లెలో రెండు, మదనపల్లెలో 4 చెవులకు నీటిని మళ్లించారు. పుంగనూరులో 2, పలమనేరులో కొంత మేర చెరువులకు PBC నుంచి నీటిని తరలిస్తారు. ఎక్కడన్నా నీటి సమస్య వస్తే ఎదుర్కొనుందేకు సిద్ధమని అధికారులు తెలిపారు.
News February 14, 2026
చిత్తూరు: నీరున్నా వృథాగా వాడితే ఇబ్బందులే.!

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.


